17, జూన్ 2009, బుధవారం

ఇళ్ళు కట్టుకోలేని రాజులు


ఇళ్ళు కట్టుకోలేని రాజులు
By
kadambari piduri,



పశ్చిమ గోదావరి జిల్లాలో "పెనుగొండ"ఉన్నది.

అక్కడ "రాజులు ఇళ్ళు కట్టుకోరు.

వీలైతే ఆ పట్టణ పరిధికి ఆవల నిర్మించుకుంటారు.

కారణం???

"వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి"కథ అందరికీ తెలిసినదే!

కుసుమ శ్రేష్ఠి పిల్లలు కవల పిల్లలు విరూపాక్షుడు, వాసవి.

వీరి కులగురువు భాస్కరాచార్యుడు.

18 పరగణాలకు అధిపతి కుసుమ శ్రేష్ఠి.

వేంగీ దేశపు సామ్రాట్టు "విష్ణు వర్ధనుడు"

(=విమలాదిత్యుడు ఇతని కుమారుడే సుప్రసిద్ధ "రాజరాజనరేంద్రుడు).

*******************************************************

విరూపాక్షుని పెళ్ళికి వచ్చిన చక్రవర్తి, ఆతని చెల్లెలైన వాసవిని చూసి,

"నీ కుమార్తెను పెళ్ళాదతానని" కుసుమశ్రేష్ఠుని అడిగాడు.

"నేను యోగినిగానే జీవిస్తాను. కనుక 'కన్యక'గానే ఉంటాను." అని ఆమె పలికినది.

"కుల గౌరవమును కాపాడుటకై ఆమె తీసుకున్న దృఢనిశ్చయము(అగ్ని ప్రవేశము),

ఆమెను "దేవత"గా నిరూపించెను.

సేనలతో దండయాత్ర చేసిన విమలాదిత్యుడు,ఆ వార్త వినగానే మరణించాడు.

##########################################


ఆనాటి నుండీ,"రాజుల పెనుగొండలో ఇళ్ళు నిర్మించుట లేదు.

ఈ సంప్రదాయమును నేటికీ ప్రజలు గౌరవిస్తున్నారు.

***********************************************************

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...