11, జనవరి 2011, మంగళవారం

కరెంటు లేకున్నప్పటికీ వారి నిష్కల్మష కృషి











భారతీయ విజ్ఞానానికి క్రీస్తు పూర్వం నుండీ ఉన్న పునాదులకు నిదర్శనమైన
చారిత్రక అమూల్య సంపద తాళ పత్ర సంపుటిగా లభ్యమైంది.
ఆ శ్లోక సంపుటి
క్రీ//పూ//300 సంవత్సరములలోని చాణుక్యుని
"నీతి దర్పణము"అనే ఉద్గ్రంధము.
Mysore prachya likhita bhanadagar, లో ఉద్యోగి శ్యామ శాస్త్రి,
సంస్కృత, కన్నడ, ఆంగ్లాది భాషలలో పట్టు ఉన్న విద్వాంసుడు.
Rudrapatna Shamashastry లైబ్రరీలోని
తాళ పత్రాలను నిరంతరమూ పరిశీలిస్తూ భద్ర పరిచే వాడు.
ఒక రోజు రుద్రపట్నం శ్యామ శాస్త్రి ప్రాచీన వ్రాత ప్రతులను సర్దుతూండగా
ఆయనకి ఒక తాళ పత్ర గ్రంధము కనబడినది
marvelous Indian History అది;" చాణుక్యుని రచన " కనబడింది.
ఆ palm leaves లో ఉన్న శ్లోకాలను చదువుతూ,
అమితానంద ఉద్వేగాలతో ఆనంద బాష్పములతో పులకించిపోయారు.
1905 లో శ్యామ శాస్త్రి గుట్టలుగా ఉన్న తాటాకు గ్రంధ ప్రతులనుండి
అనుకోకుండా ఈ అమూల్య రచనను కనుగొన్నారు .
రుద్రపట్నం శ్యామ శాస్త్రి నివాస గృహం పేరు” అశుతోష్”.
అప్పటికి వారి కాలనీలో కరెంట్ లేదు.
అందుచే వారు టార్చ్ లైట్ ని వేసుకుని పని చేసారు.
కరెంటు లేకున్నప్పటికీ వారి నిష్కల్మష కృ
షి అసిధారావ్రతంలాగా కొనసాగించారు
ఆ కుటుంబీకులు అందరూ!
కౌటిల్య గ్రంథములోని శ్లోకాలను
ఫొటోలు తీయుట,
తర్జుమా చేయుట ఇత్యాది అనేక పనులు చేస్తూ,
శ్యామ శాస్త్రికి చేదోడు వాదోడుగా మనుమరాలు,మనుమడులు నిలిచారు.
మనుమలు చాణుక్యుని రచనను యావన్మందికీ పరిచయం చేసే
ఆ మహత్తరమైన బృహత్ కార్యంలో భాగస్వాములు ఐనారు.
ఈ మహత్తర కార్యము 1905 లో మైసూర్ లోని ఓరియంట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్
(The Oriental Research Institute (ORI) జరిగింది.

















ఆ Details, News English లో అచ్చు ఐనాయి.
´ Indian Antiquity and Mysore Review మొదలగు వివరాలు ప్రింట్ ఐనాయి.
అప్పటినుండీ, రమారమి 6 ఏళ్ళు అవిరళ కృషి చేసి,
1915లో ముద్రణా రూపంలో లోకానికి
అందించ గలిగారు.

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...