15, జులై 2012, ఆదివారం

తగువులు తీర్చిన జగన్నాథ పండితుడు








ఉత్తర హిందూస్థానానికి తెలుగువాళ్ళు 
ఎవరైనా వెళితే,
అక్కడివాళ్ళు ‘మీరు తెలుగు వారా? 
మీరు ఆంధ్రులా?’అని అడగరు.
మరి ఏమని అడుగుతారు?


“యే పండిత్ రాజ్ కీ దేశ్ వాశీ హై| 
              యే మల్లినాధసూరీ కే దేశ్ వాశీ హై|”
                                           అంటూ చెబుతారు.
“మీరు పండిత రాయల దేశము వారా?
    మీరు మల్లినాధ పరగణాల వారేనా?” 


అంటూ ప్రశ్నిస్తూ పరిచయాలను చేసుకుంటారు.
రాష్ట్రాన్నీ, సీమలనూ, దేశాలనూ 
ఆట్టే పరిగణనలోనికి తీసుకోకుండా
పాండిత్యాన్నిబట్టి మాత్రమే,
ఆగంతకుల గురించి ప్రస్తావించుకునే గొప్ప సాంప్రదాయాలు
అలనాటి (16వ శతాబ్దము నాటి)హిందూదేశములో,
ముఖ్యంగా ఉత్తరాదిని నెలకొని ఉన్న గొప్ప సామాజిక అంశము.
కవి- అనే పదము కన్నా “పండితుడు” అనే పదములో
పవిత్ర భావన గుబాళింపు ఉన్నది,
“ఋషి తుల్యుడు, దైవ సమానుడు”
అనే సమున్నత భావన అది.
జగన్నాధ పండిత రాయలు- వంటి
కొద్దిమంది మాత్రమే మనకు ఇలాగ చరిత్రలో గోచరిస్తూంటారు.


*******************************************


జగన్నాథ పండిత రాజ్ ఉపద్రష్ట గృహనామము కల కుటుంబము వ్యక్తి.
ఆ రోజులలో సాధారణముగ బ్రాహ్మణులు, “ఉంఛ వృత్తి”ని అవలంబించేవారు.
ప్రధానంగా భగవత్ సేవయే- తమ జీవన విధానముగా ఎన్నుకొనుటచే,
వారు లౌకిక భోగాదుల పట్ల విముఖులై-
స్వచ్ఛందముగా బీదరికములో ఉండుటయే ఇందుకు కారణము.
జగన్నాథ పండిత రాయలు అట్టి ఉంఛ వృత్తి- స్వీకరించాడు.
ఉంఛ వృత్తి:-
(విద్యార్ధిగా, బ్రహ్మచారి ఐన విద్యార్ధిగా యాచన చేయుట
      అనగా- ordinary Brahmin engaged in unchavritti 
                                              (i.e. begging for alms)
‘ఏ రోజుకు సరిపడే భోజనమును ఆ రోజుకు మాత్రమే సంపాదించాలి- అనేది
ఉంఛవృత్తిలోని నియమము.


సంఘసేవా దృక్పథంతో మెలగే తాపసులు, బౌద్ధ సన్యాసులు,
దీనిని ఒక పవిత్ర భావనా మార్గంగా- హిందూ సంఘముచే ఏర్పరచబడినది.
తాపసులు, బౌద్ధ సన్యాసులు,
దీనిని ఒక పవిత్ర భావనా మార్గంగా- హిందూ సంఘముచే ఏర్పరచబడినది.
ఈ క్రమంలో బ్రాహ్మణ విద్యార్ధులు యాచనచే లభించిన
ధాన్యాదులను, వారే వండుకునే వారు,
లేదా “గురు పత్ని” వండి, గురుకులములోని అందరికీ వడ్డనలు చేసేది. 
గురువు భార్య , కన్నతల్లి ప్రేమను విద్యార్ధులకు ఒసగేది.
ఈ క్రమంలో విద్యార్ధులు, భోజనం చేయడానికి- విస్తళ్ళు తయారుచేసుకునే వాళ్ళు.
అలాగ జగన్నాథుడు కూడా గ్రామంలోని
ఒక మర్రి చెట్టు, బాదం చెట్టు ఆకులను కోసి తెచ్చుకుని, విస్తళ్ళను కుట్టిపెట్టేవాడు.
ఐతే ఒక రోజు ఈ విధికి ఆటంకం ఏర్పడింది.
అక్కడ కాపలాదారు కొత్తగా వచ్చిఉన్నాడు.
కావలివాడు  నిరోధించాడు” ఈ చెట్లను తాకవద్దు.
మా అయ్యగారు నిషేధించాడు” అటూ అటకాయించాడు.
ఈ విఘాతమునకు నిర్ఘాంతపోయాడు జగన్నాథుడు.
“చక్రవర్తి- ఈ భూమిని మా యజమానికి
జాగీరుగా బహుమానంగా ఇచ్చారు” అన్నాడు ఆ కావలివాడు.
గ్రామ వ్యవహారాలను చూసే బాధ్యతలను కరణం చూసేవాడు.
అందుచేత జగన్నాథుడు గబ గబా కరణము వద్దకు వెళ్ళాడు.
(village karanam = 
        official incharge of village revenue and administration)
“ఆకులను కోసుకోవడానికై అనుమతి ఈయండి” అంటూ అడిగాడు.
కానీ ఆ కరణం నిర్లక్ష్యంగా నిర్ద్వంద్వంగా చెప్పేశాడు
“ఢిల్లీకి వెళ్ళు. పోయి,పాదుషాకు చెప్పుకో! నా చేతుల్లో ఏమీ లేదు”


జగన్నాథుడు తల్లిదండ్రులకు ఈ దుర్ఘటనను వివరించాడు.
భార్య కామేశ్వరికి చెప్పాడు
“ముడి బియ్యమునూ, బెల్లమునూ మూట కట్టి ఇవ్వు”
(ఆ రోజులలో బాల్యంలోనే పెళ్ళిళ్ళు జరిగేవి)
Gur and pounded rice లను భుజంపైనిడుకుని,
పెద్దలకు పాదాభివందనములు చేసాడు జగన్నాథుడు.
విద్యార్ధి జగన్నాథుడు హుటాహుటిన ఢిల్లీకి
(ప్రాచీన కాలంలో పేరు – హస్తినాపురము) బయలుదేరాడు.
(gur and pounded rice for the journey,
and really went to Delhi!)
జగన్నాథుడు వీరావేశంతో డిల్లీ కోట వద్దకు చేరాడు,
కానీ “తన బోటి వారికి సింహద్వారము వద్దకు కూడా చేరలేరు" 
అని అర్ధమైపోయింది.
కులపతి మిశ్రా “మీకు ఆధారం దొరికే వఱకూ -
మా ఇంట్లో కొన్నాళ్ళు బస చేద్దురుగాని, రండి!” అని పిలిచాడు.
మిశ్రా కుటుంబీకులు జగన్నాథుని సమాదరించారు.
కొన్నాళ్ళకు అదృష్టము ఆతని తలుపు తట్టినది.
ఒకానొక రోజున  జగన్నాథుడు, 
అక్కడి సైనికులతో వాగ్వాదం  చేయాల్సి వచ్చినది.
ఆ ఇరువురు పర్షియన్ సైనికులు. (Persian speaking soldiers)
వాళ్ళిద్దరూ పరస్పరం పోట్లాడుకుంటుంటే,
అక్కడే ఉన్న జగన్నాథుడు ఒక్కడే ప్రత్యక్ష సాక్షి ఐనాడు.
రాజాస్థానానికి ఆ ఇద్దరు సైనికులు ” ఇతడు అంతా చూసిన వాడు.
(witnessed the quarrel) మాలో ఎవరు దోషియో కళ్ళారా చూసిన వ్యక్తి ఈతడే!
అంటూ జగన్నాథుని  కొలువుకు రప్పించారు.
స్థానానికి ; జగన్నాథుని కొలువుకు రప్పించారు.
ఆ పర్షియన్ భాషీయులు ఇద్దరిలో ‘ఎవరు నిర్దోషి?’ అని 
తేల్చడం కష్టమై పోయినది.
కొందరు సాక్షులలో ఒక్క జగన్నాధుని పలుకులే 
నిజ నిర్ధారణకు పనికి వచ్చాయి.
 జగన్నాథుడు స్వతహాగా ఏకసంథాగ్రాహి
(recall the altercation/ a single recitation)
అతను ఉన్నది ఉన్నట్లుగా అక్షరం పొల్లుపోకుండా
సైనికుల  సంభాషణను న్యాయాధికారికి చెప్పగలిగాడు.
(repeated the exchanges verbatim,
eventhough he did not know a word of Persian! )
“ఈ కొత్త మనిషికి పర్షియన్ అస్సలు తెలీదు.
ఐనప్పటికీ ఆ పరాయి భాషలోని సైనికుల వాదులాటను
ఉచ్చారణా దోషాలు సైతం లేకుండా సభాసదుల సమక్షంలో నుడివాడు,
జగన్నాథుడు సభాసదుల సమక్షంలో నుడివాడు.
సభలోని వారు, రాజోద్యోగులతో పాటు,
చక్రవర్తి కూడా జగన్నాథుని
“ఓయీ! నీ ఏకసంథాగ్రాహిత్వమునకు 
మేము ముగ్ధులమైనాము.  వహ్వా!”
జగన్నాథుని వేనోళ్ళ పొగడ్తలలో ముంచెత్తారు.
అతని పేరు, వివరాలను అడిగి తెలుసుకున్నారు.
“జగన్నాథా! నీ వంటి మేధావి
మాకు ఆస్థాన కవిగా ఉండడము
మాకు గర్వకారణమౌతుంది” అంటూ దీనారములను ఇచ్చాడు.
అలాగ కాకతాళీయంగా ఆ ఆస్థాన కవి పదవి 
ఆతనికి విలువైన కానుకగా లభించినది.
ఆ నాటి నుండీ “పండిత రాజ్ జగన్నాథ్ ( /జగన్నాథ పండిత రాయలు)” గా
గౌరవ స్థానాన్ని పురస్కారముగా పొందగలిగాడు.


**************************


“ఈయన మన ఆంధ్రుడు” అని 
గర్వపడుతూ చెప్పుకోగలిగిన ఈ వ్యక్తి, ముంగండలో జన్మించాడు.
జగన్నాధ పండిత రాయలు యొక్క తల్లిదండ్రులు పేరుభట్టు, మహా లక్ష్మీ దంపతులు.
ఆతడే “జగన్నాధ పండిత రాయలు”.
“రసగంగాధరం”, “భామినీ విలాసము”,
“అసఫ్ విలాసము” మున్నగు గ్రంధాలు,
అన్నిటికీ మించి “గంగాలహరి” ప్రసిద్ధి గాంచినది.
జగన్నాధ పండిత రాయలు “పంచలహరులు” ను 
వక్కాణముగా రచించిన వ్యక్తి,:-
ఆ సంస్కృత స్తోత్రముల పేర్లు:-
“గంగా లహరి ”- దివిజ గంగానది స్తుతి
”అమృత లహరి ”- యమునా స్తుతి
“కారుణ్య లహరి”- శ్రీ విష్ణు మూర్తి స్తుతి
“లక్ష్మీ లహరి”-  శ్రీ లక్ష్మీదేవి స్తుతి
“సుధాలహరి”-  సూర్యస్తుతి.
;


Published On Friday, February 10, 2012 
By ADMIN. Under: విజ్ఞానం, వ్యాసాలు.   
   రచన  : కాదంబరి
haaram:జగన్నాధ పండిత రాయలు ; (LINK 2 )
,

2 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

మీ కోణం బాగుంది. ఈయన గురించే నేను కూడా వ్రాసానండీ.

Anil Piduri చెప్పారు...

మీ బ్లాగు రసజ్ఞమయముగా ఉన్నది. మీరు అన్నట్లు- కథా పరిశీలనా, శైలిలలో మన ఇద్దరి ఎస్సే లూ- కొంచెం భిన్నమార్గాలలో నడిచినప్పటికీ- కథాసారము మాత్రము - "వ్యాసము" అనే తివాచీమీద బాగానే వెదజల్లబడినది కదూ!
మీ బ్లాగు - చాలా బ్యూటిఫుల్ గానూ,పఠకులకు అనేక కొత్త విషయాలనూ తెలుపుతూ- అద్భుతంగా సూపర్బ్ గానూ ఉన్నది
రసజ్ఞ గారూ!

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...