21, జులై 2012, శనివారం

శ్రీకృష్ణుడు పురాణపురుషుడు


శ్రీకృష్ణుడు పురాణపురుషుడు, ప్రజల అభిమానాన్ని సంపాదించి, 
దైవస్థానాన్ని పొందిన అద్భుత వ్యక్తి. !!!!!
శ్రీకృష్ణుని ప్రాచీనతనునిరూపించే ఆధారాలు అనేకం దొరికాయి. 
ఆ ఆధారాలను కనుగొని, వెల్లడించినది 
విదేశీయులే అవడము చెప్పుకోదగిన విశేషమే!
(Sir William Jones’ studies )  సర్ విల్లియం జోన్స్ 
అధ్యయనములు మున్నగునవి 
భగవంతునిగా సుప్రతిష్ఠుడు ఐనట్టి 
"శ్రీకృష్ణుడు- అత్యంత ప్రాచీనకాలమునాటివాడు" తేటతెల్లము చేస్తూన్నవి.
-శ్రీకృష్ణుని- అత్యంత ప్రాచీనతను, వైష్ణవము పురాతన కాలము నుండీ 
ప్రజాబాహుళ్య ఆకర్షణా మతముగా - సుస్థిరమైనది. 
ఈ విశేషాలను 3-4 శతాబ్దములనాటి 
క్రీస్తుపూర్వ నాణెముల ముద్రలు - ఋజువు చేస్తూన్నవి
ఆఫ్ఘనిస్తాన్, సోవియెట్ రష్యాసరిహద్దులలో  "ఐ-ఖనం" అనే ప్రదేశములో 
అన్వేషణ జరిపారు.
ఆ సర్వేను చేసిన పరిశోధకుడు "పి.బెర్నార్డ్ "ఫ్రెంచ్ ఆర్కియలాజికల్
(P. Bernard and a French archeological expedition) అన్వేషకులు. 
వారిని (antiquity of Krishna worship in India) ఆకర్షించిన అంశము -
"భరతవర్షములో శ్రీకృష్ణ ఆరాధన ఎంత ప్రాచీనమైనది? "     
Ai-Khanum వద్ద ఆరు కంచు నాణెములు త్రవ్వకములలో లభించినవి. 
ఆ రెక్టాంగులర్ కాయిన్లు 180-165 బి.సి. నాటివి అని బోధపడినది.  
 Indo-Greek ruler Agathocles (180?-?165  BC).  
దీర్ఘ చతురశ్రముగా ఉన్న 6 కంచు (bronze) కాయిన్స్ లభ్యమైనవి.  
అవి అగాథాక్ల్స్ - అనే ఇండో గ్రీకు పాలకుడు జారీ చేసిన
దీర్ఘ చతురశ్రముగా ఉన్న 6 కంచు (bronze) కాయిన్స్
(six rectangular bronze coins (180?-?165 BC)  గొప్ప చారిత్రక సంపద.
ఆ ఆరు నాణెములపైన గ్రీకు, బ్రాహ్మీ అక్షరములు కలవు. 
ఆ రెండు భాషల లిపితోపాటుగా విష్ణుమూర్తి/ వాసుదేవ బొమ్మ ఉన్నది.
ఆ ప్రతిమ హస్తములలో చక్రము, శంఖము ఆకారపు వస్తువు ఉన్నవి. 
వైష్ణవ మతములో ఆరాధించే "శ్రీ విష్ణుమూర్తి"  శంఖ, చక్ర, గదా, పద్మములను ధరించును. 
వీనిలోని రెండు చిహ్నములు- ఐన శంఖ, చక్రముల ధారణ-  వలననే 
'ఈ బొమ్మ విష్ణువుది!'- అనే అభిప్రాయానికి ప్రత్యక్షనిదర్శనము. 
అక్కడ దొరికిన మరో - "అగాధో క్లిస్- కాయిన్" "(Agathocles (180?-?165 BC) పైన 
"హలమును ఎత్తి పట్టినట్టి బలరామదేవుని చిత్రము, 
అలాగే పరమేశుడు, దుర్గాదేవి, కుషాణ ప్రభువైన రెండవ కనిష్క చక్రవర్తి బొమ్మ, 
3-4 శతాబ్దములనాటి కాయిన్- బ్రహ్మదేవుని వదనము కలది- 
చారిత్రక శోధనకు అమూల్యముగా దొరికినవి. 


*****************************************************:


దర్గా పీర్ రత్తన్ నాథ్- కాబూలులో ఒక విగ్రహము ఉన్నది. 
ఆ పాలరాతి బొమ్మ పీఠముపై ఇలాగ రాసి ఉన్నది.
"మహా వినాయకుని ఘన సుందర మూర్తి"- అని పీఠముపైన చెక్కబడి 
ఉన్న ఆ మార్బుల్ ప్రతిమను "షాహి రాజా ఖింగలుడు" ప్రతిష్ఠితమొనర్చెను. 
ఆఫ్ఘనిస్తాన్ లో 5వ శతాబ్దికి చెందిన ఈ బొమ్మ గర్దెజ్ అనే చోట లభించినది.




(మెగస్తనీస్ - గ్రీకు దేవుడైన హెరాక్లిస్ - కృష్ణుడు పర్యాయ పదములుగా భావిస్తూ- "  
"యమునా నదీ ప్రాంతాలలో శ్రీక్రిష్ణుడు పూజ్యనీయుడైనాడు" అని లిఖించాడు)


స్వామి బి.జి. నరసింఘ ఇలాంటిఅనేక విశేషాలను తన వ్యాసములలో చెప్పారు.


ఆధారములు:-


శ్రీ కృష్ణ 
image of Vishnu, or Vasudeva, carrying a Chakra,
a pear-shaped vase/ conchshell,                                    
Indo-Greek ruler Agathocles (180?-?165B.C.).
(six rectangular bronze coins issued by the Indo-Greek ruler  #

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...