15, ఆగస్టు 2013, గురువారం

"సారనాధ్" పేరు ఎలా వచ్చింది?

#"సారనాధ్" పేరు ఎలా వచ్చింది?:-
మన  దేశములో తొలి జింకల పార్కు ఏది?:-
మన పావన త్రివర్ణ పతాకములో మధ్య ఉన్న ధర్మచక్రము- ను 
ఉత్తర ప్రదేశ్ లోని "సారనాధ్ స్థూపము” నుండి గైకొన్నారు. 

ఈ విశేషము మన అందరికీ తెలిసినదే!

హిందూ దేశములో మొట్టమొదటి 'సాధు జంతు ఉద్యాన వనము ', 
అనగా "అభయారణ్యం" ఉన్నదా? 
ఐతే అది ఏది? ఎక్కడ ఉన్నది?

*************************;
;
గౌతమ బుద్ధుని జీవిత గాధతో ముడి ఉన్న చారిత్రకాంశము ఇది.
దేవ భాష/ సంస్కృతభాష రాజ భాషగా ఉన్న రోజులు అవి. 

త్రిపీటకములు:-  
"బుద్ధమ్ శరణమ్ గచ్ఛామి।
సంఘం శరణమ్ గచ్ఛామి। 
ధర్మం శరణమ్ గచ్ఛామి। "

త్రి పీటకములు ("Three Baskets") బౌద్ధ మతమునకు పునాదిరాళ్ళు. 
     
పామరుని నుడికారములుగా ఈసడించబడి, నిరాదరణకు గురైన  భాషలు సాహిత్యములో చోటుకు నోచుకోలేదు. 
అలాటి అతి ప్రాచీన కాలాన బుద్ధభగవానుడు సామాన్యుల భాషకు పట్టం కట్టాడు. 
భాషాపరంగా అద్భుత సాహసి ఆయన- అని నిక్కంగా వక్కాణించవచ్చు. 
"పాలీ భాష" లోనే ఆయన బోధనలన్నీ కొనసాగాయి.

అలాగే అప్పటి ప్రాంత, దేశాదుల పేర్లు "బుద్ధ జాతక కథలు" లో 
"పాళీ భాష"లోని స్వస్వరూపాలలోనే ఋజువును పొందినవి. 

*************************;

జింకకు అనేక నామములు కలవు. సారంగము, మృగము, మృగోద్యానము- మొదలైన పేర్ల లిస్టు ఉన్నది.
అలాగే - ఆ నాటి సమాజములో ఇలాటి "పాలీ పద పుష్పములు" లెక్కకు మించి ఉన్నవి. 
అట్టి కొన్ని పలుకులు చూద్దాము.
ఋషి పట్టణం, ధర్మ చక్రము, ఇత్యాది గీర్వాణ పదములకు ప్రతిగా-  
ఆయా మాటలు బౌద్ధ పరివ్రాజకులు వ్యాప్తిలోనికి తేగలిగారు.   
“మృదావ” అంటే- హరిణముల పార్కు, వీనినే నేడు "అభయారణ్యాలుగా" తీర్చిదిద్దారు. 
ఋషి పట్టణము నకు పాలీ ధ్వని- “ఇసి పటన” గా రూపుదిద్దుకున్నది. 

*************************;

జ్యూయన్ సాంగ్ (Xuanzang) ప్రఖ్యాత చీనా యాత్రికుడు, యాత్రారచనలను- 
తాను చూసిన అగణిత అంశాలను పూసగుచ్చినట్లు, అక్షర రూపాలను కల్పించడములో ఆయనది అందె వేసిన చెయ్యి. 
అతని హస్త తూలిక (pen) - అప్పటి బౌద్ధ సమావేశాలనూ, సాహిత్యాన్నీ అక్షర బద్ధం చేసినది. 
ఆ రచనలలో - ఈ సమాచారములను ఉటంకించాడు. 
నిగ్రోధమిగ జాతక కథ  (Nigrodhamiga Jataka - J.i.145ff) హరిణ వన వివరములను రాసాడు. 
బెనారస్ రాజు (= కాశీ ప్రభువు) "హరిణాలు స్వేచ్ఛగా తిరుగాడేటందు కోసమని- అడవిని కానుకగా సమర్పించుకున్నాడు. 

*************************;

సారంగము:-  
మన పావన త్రివర్ణ పతాకములో మధ్య ఉన్న ధర్మచక్రము- ను 
సారనాధ్ స్థూపము నుండి గైకొన్నారు. 
ఈ విశేషము మన అందరికీ తెలిసినదే! 
ఉత్తర ప్రదేశ్ లోని "సారనాధ్" కు ఆ పేరు ఎలా వచ్చింది? 
ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు. 
 సారంగము అనే సంస్కృత పదమునకు "జింక" అని అర్ధము కదా! 

సారంగ నామము ఆధారమైనది. జింకను అలంకారముగా తన చేతిలో ధరించిన వ్యక్తి “సారంగ పాణి”. 
ఆ! మీరు కనుక్కున్నారన్న మాట  ; 
పరమేశునికీ, ఘౌతమ బుద్ధుని అవతారమునకు – ఈ నామాంతరము కలిగెను.
జింకల కేంద్రంగా విలసిల్లుతూన్న ఆ చోటుకు - సారంగము – పద మూలముగా: 
“సారంగ నాధ్” అని ఆ పట్టణానికి పేరొచ్చింది. 
అలాగే - "సారనాధ్"- “సారంగనాధ్” అను మాట నుండి వచ్చినదే. 
*************************;

"Lord of Deer" సారంగ పాణి,ఆ స్వామి కొలువైన ప్రదేశమే "సారనాధ్".  
అందున్న స్థూపము - "సారనాధ్ స్థూపము". 
ఆ స్థూపము మీదనున్న "ధర్మ చక్రము"ను నీతికీ ధర్మ ప్రవర్తనకూ ప్రతీకగా స్వీకరించి,
పింగళి వెంకయ్య- మువ్వన్నె పతాకము మధ్య ఉంచి, సకల జనామోదముగా రూ పొందించాడు.       

*************************; 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...